ఎవరు లేకున్నా, నా వెంట ప్రజలున్నారు: వైయస్ జగన్

YS Jagan
ఒంగోలు: తనవెంట ఎవరున్నా లేకున్నా వెన్నుతట్టి మేమున్నామంటూ ప్రేమ ఆప్యాయతలు పంచే ప్రజలున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తనకు ఇంత పెద్దకుటుంబాన్ని ఇచ్చారని, ప్రజల ఆప్యాయతలు మరువలేనివని చెప్పారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల, కంభం మండలాల్లో శుక్రవారం జరిగిన తొలిరోజు ఓదార్పుయాత్రలో ఆయన ప్రసంగించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. వైఎస్‌ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి గుండె లబ్‌డబ్‌లబ్‌డబ్‌ బదులుగా వైఎస్‌ వైఎస్‌ అని కొట్టుకుంటోందన్నారు.

రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - వైఎస్‌ మనకందించిన మణిరత్నం జగన్‌ అంటూ కొనియాడారు. యాత్రలో వైఎస్‌ తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, జడ్పీ అధ్యక్షురాలు అరుణమ్మ, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, బూచేపల్లిసుబ్బారెడ్డి, కందుల గౌతమ్‌నాగిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు బి.చంద్రశేఖర్‌యాదవ్‌, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యాత్రలో పాల్గొనలేదు.

వచ్చే నెలలో కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర నిర్వహిస్తానని జగన్‌ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కడప జిల్లా పోరుమామిళ్లలోని బంగ్లారోడ్డు, పాత సినిమాహాలు వద్ద, కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లె వద్ద వైఎస్‌ విగ్రహాలను జగన్‌ ఆవిష్కరించారు. బద్వేలు, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు కమలమ్మ, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణారావు, గోవిందరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సురేష్‌బాబు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+