సీమాంధ్ర ఎంపిలు బలిసి మాట్లాడుతున్నారు: మధు యాష్కీ

Madhu Yashki
హైదరాబాద్: తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చిన తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ విరుచుకు పడ్డారు. హైదరాబాదులోని గండిపేట నీళ్లు తాగి బలిసి మాట్లాడుతున్నారని ఆయన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై వ్యాఖ్యానించారు. రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం డిమాండ్ ను ముందుకు తెచ్చారని సీమాంధ్ర ఎంపిలు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రాజకీయ నిరుద్యోగులది, నిరుద్యోగులది కాదని ఆయన అన్నారు. ప్రజా ఉద్యమమని ఆయన చెప్పారు.

బస్సు చార్జీలు లేకుండా హైదరాబాద్ వచ్చిన లగడపాటి రాజగోపాల్ అన్ని అస్తులు ఎలా సంపాదించారని ఆయన అడిగారు. కావూరి, రాయపాటి, లగడపాటి తెలంగాణను దోచుకుని తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమానికి కొట్టుకుపోతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను వారు అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అవమానాలను తెలంగాణ ప్రజలు సహించబోరని ఆయన అన్నారు.

పదవుల కోసం గతంలో తెలంగాణ నాయకులు మోసం చేసి ఉండవచ్చునని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిస్తే ప్రజలు తరిమి కొడతారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పల్లెపల్లెకూ పాకిందని ఆయన అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చి ఇంకా అధికారం కొనసాగించాలని సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+