వైయస్ జగన్ గనుల వ్యవహారంపై ముప్పేట దాడి

వైయస్ జగన్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా విరుచుకుపడ్డారు. సున్నంరాయి నిక్షేపాల వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా జగన్ కు ఖనిజాలను కేటాయించారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిపించాలని తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. సున్నంరాయి నిక్షేపాల కేటాయింపు వ్యవహారంపై బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ కూడా జగన్ పై విమర్శలకు, ఆరోపణలకు దిగారు. వైయస్సార్ క్రిమినల్ మైండ్ తో వ్యవహరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తిరుపతిలో అన్నారు.












Click it and Unblock the Notifications