ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్చిలను టార్గెట్ చేసుకున్న కడప ఎంపి వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఒంగోలు: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చర్చిలను లక్ష్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో బల సమీకరణకు జగన్ వర్గం చర్చిల వెంట పడినట్లు సమాచారం. వైయస్ జగన్ కు హిందూ, క్రిస్టియన్ సమాజాల్లో బంధువులు, మిత్రులు, సన్నిహితలు ఉన్నారు. దీంతో జగన్ వర్గం పాస్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ మనుషులు పాస్ట్రర్ల సమావేశం ఏర్పాటు చేసి వారి సహాయ సహాకారాలు కోరినట్లు చెబుతున్నారు. క్రైస్తవ సమూహా కార్యక్రమాల్లో జగన్ కు అనుకూలంగా చెప్పాలని వారు పాస్టర్లను కోరినట్లు, అందుకు వారు అంగీకరించినట్లు సమాచారం.

ప్రీస్ట్స్, పాస్టర్లు, ఎవాంజెలిస్టులు క్రైస్తవుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. ప్రకాశం జిల్లాలో మెజారిటీ మాలలు క్రైస్తవులు. మాల జనాభా ఈ జిల్లాలో 20 శాతం ఉంటుంది. క్రైస్తవ మత గురువుల ద్వారా జగన్ కు అనుకూలంగా వారిని మలిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారి మద్దతు లభిస్తే ప్రకాశం జిల్లాలో ఓట్లు రాబట్టుకోవడం సులభమవుతుందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X