ముఖ్యమంత్రి రోశయ్యపై మరోసారి కొండా సురేఖ ధ్వజం

Konda Surekha
ఒంగోలు: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చిల్లరగా వ్యవహరిస్తున్నారని, వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనను అడ్డుకుంటున్నారని ఆమె విమర్సించారు. జగన్‌ నాయకత్వాన్ని బలపరచాల్సిన సమయం ఆసన్నమయిందని, ఓదార్పు గురించి కొందరు నాయకులు చెడు ప్రచారం చేశారని ఆమె అన్నారు. సోనియాకు ఓదార్పుపై ఇప్పటికయినా సరైన సమాచారం ఇస్తే కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతులుంటాయని ఆమె అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే భూస్థాపితం అయిందని, లేకపోతే ఇంకా కనుమరుగవుతుందని సురేఖ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఓదార్పు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా జగన్‌తో పాటు వైఎస్‌ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న సురేఖ బహిరంగ సభల్లో మాట్లాడారు.

జగన్‌ ఓదార్పు వెంట ఎమ్మెల్యేలు లేకపోయినా, మంత్రులు రాకపోయినా ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని ఆమె అన్నారు. తాము కేంద్రం నుంచి టిక్కెట్లు తెచ్చుకున్నా గెలిపించే సత్తా మాత్రం ప్రజలకే ఉందన్నారు. జగన్‌ను వైఎస్‌ అంతటి నాయకుడిని చేయాలని సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కారంచేడులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబం వైఎస్‌దని, అంతా జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. పులులు, సింహాలు అడవిలోకి రానంత వరకు తోడేళ్లు, నక్కలు రాజ్యమేలుతాయని, ఇప్పుడు అవి వచ్చాయని, కనుక తోడేళ్లు, నక్కలు ఇక పరుగులు తీస్తాయని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+