ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ టూర్: వైయస్ జగన్ క్యాంప్ లో టెన్షన్

వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా 2014లో ముఖ్యమంత్రి కావడానికి వీలైన పిసిసి పదవి అయినా సోనియా అప్పగిస్తుందనే ఆశతో వైయస్ జగన్ వర్గం ఉంది. కేశవరావుకు పిసిసి పదవి అప్పగిస్తే ఇక ఏ మాత్రం ఆశలు లేకుండా పోతాయి. వైయస్ జగన్ పై కాకున్నా తమపై చర్యలకు అధిష్టానం ఒడిగట్టవచ్చునని కూడా జగన్ వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. పిసిసి కొంత మంది నాయకులపై చర్యలు తీసుకున్నప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. అందువల్ల తమను పూర్తిగా అణచివేసేందుకు ఏ విధమైన చర్యలకైనా అధిష్టానం పూనుకోవచ్చునని అనుకుంటున్నారు.
గతంలో చాలా సార్లు రోశయ్య మంత్రి వర్గ విస్తరణకు ప్రయత్నాలు చేశారు. ప్రతి సారీ ఏదో రకమైన ఆటంకం ఎదరువుతూ వచ్చింది. చాలా సార్లు జగన్ వర్గం వ్యూహాత్మకంగా అందుకు పడింది. ఇప్పుడు ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపై కూడా వారు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏమైనా, తమపై వేటు తప్పదనే అభిప్రాయంతోనే వారు ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications