కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు?

కాగా, కర్ణాటక శాసనసభలో సోమవారం కనీవినీ ఎరుగని వాతావరణం నెలకొంది. సభ వాయిదా పడిన తర్వాత కూడా శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. యెడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గిన తీరుపై కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు గవర్నర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. అనర్హత వేటు పడిన శాసనసభ్యులు కూడా రాజభవన్ ముందు ఆందోళనకు దిగారు. స్పీకర్ నిర్ణయాన్ని బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు సమర్థించారు. అసమ్మతి శాసనసభ్యులు చొక్కాలు చింపుకుని వచ్చారని ఆయన అన్నారు. అనర్హతకు అర్హత సాధించింది వారేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, జెడి(ఎస్) విధ్వంసక పాత్ర పోషించాయని బిజెపి నేత నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
విశ్వాస పరీక్ష నెగ్గిన తీరును జెడిఎస్ నేత కుమారస్వామి తప్పు పట్టారు. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ఆయన విమర్శించారు. విశ్వాస తీర్మానం చట్టప్రకారం చెల్లదని ఆయన అన్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను స్పీకర్ లెక్కించి ఉండాల్సిందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశమే జరగలేదని కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని వారన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications