Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటకలో 16 మంది శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు

karnataka vidhana soudha
బెంగళూర్: రాష్ట్రంలోని 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై కర్ణాటక స్పీకర్ కెజి బోపయ్య అనర్హత వేటు వేశారు. క్రిమినల్ కేసులను సాకుగూ చూపి ఆయన ఆ శాసనసభ్యులను ఆదివారం అర్ధరాత్రి సస్పెండ్ చేశారు. గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, దానిపై చర్య తీసుకునే అధికారం గవర్నర్ కు లేదు. సస్పెన్షన్ కు గురైన 16 మంది శాసనసభ్యులు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ అనర్హవత వేటుతో బిజెపికి 106 మంది సభ్యుల బలం ఉంటుంది. కాంగ్రెసు సభ్యులు 73 మంది, జెడిఎస్ సభ్యులు 28 మంది ఉన్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అక్టోబర్ 6వ తేదీన పార్టీల బలాబలాలను మార్చకుండా యెడ్యూరప్ప బలపరీక్షకు సిద్ధపడేలా చూడాలని గవర్నర్ భరద్వాజ స్పీకర్ బోపయ్యను ఆదేశించారు. అయితే, స్వయం నిర్ణయాధికారాన్ని ఉపయోగించి 16 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అక్టోబర్ 6వ తేదీన 16 మంది సభ్యులు యెడ్యూరప్ప ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. వారి సస్పెన్షన్ తో సభలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 208కి తగ్గింది. కాంగ్రెసు, జెడిఎస్ బలాలు కలిపితే 101 మంది సభ్యులు మాత్రమే అవుతున్నారు. దీంతో 106 మంది సభ్యుల బలంతో గట్టెక్కాలని యెడ్యూరప్ప భావిస్తున్నారు. అయితే, రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా సాగే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+