గవర్నర్ భరద్వాజ్ ను రికాల్ చేయాలి: అరుణ్ జైట్లీ డిమాండ్

విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మళ్లీ విశ్వాస పరీక్షకు గవర్నర్ తేదీని నిర్ణయించారని, ఇది సరి కాదని ఆయన అన్నారు. గవర్నర్ భరద్వాజ్ రాజీనామా చేసి, కావాలనుకుంటే రాజకీయాల్లో చేరవచ్చునని మరో బిజెపి నేత ఎం. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా హాజరయ్యారు. గవర్నర్ వ్యాఖ్యలపై తాను మాట్లాడదలుచుకోలేదని, తమ పార్టీ అధ్యక్షుడు మాట్లాడగలరని యెడ్యూరప్ప అన్నారు. గవర్నర్ గా నియమితులైన రోజు నుంచి భరద్వాజ్ కాంగ్రెసు ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.
తమపై వేసిన అనర్హత వేటుపై 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై బెంగళూర్ లోని హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. కాగా, మరోసారి విశ్వాస పరీక్షకు గవర్నర్ భరద్వాజ్ ఈ నెల 14వ తేదీని నిర్ణయించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోందని గవర్నర్ అన్నారు.












Click it and Unblock the Notifications