వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పై రాహుల్ గాంధీ ఆరా: చీఫ్ విప్, విప్ లతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. ఆయనను బుధవారం ఉదయం ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి, శైలజానాథ్ కలిశారు. రాహుల్ ఆహ్వానం మేరకే వారు ఢిల్లీ వచ్చినట్లు సమాచారం. తాము రాహుల్ రాష్ట్ర రాజకీయాలపై తమతో మాట్లాడినట్లు భేటీ అనంతరం వారు మీడియాతో చెప్పారు.

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, రాష్ట్రాభివృద్ధి గురించి రాహుల్ కు వివరించినట్లు వారు తెలిపారు. మల్లు భట్టి విక్రమార్క, కొండ్రు మురళి మొదటి నుంచి వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్నారు. శైలజానాథ్ కూడా మొదట అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తన విధేయతను కొంత మేరకు మార్చుకున్నట్లు అర్థమవుతోంది. మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రను నిర్వహించారు. దాంతో రాహుల్ తో వారి భేటీ ప్రాధ్యాన్యాన్ని సంతరించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X