వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సక్రమంగా రుణాలు అందిస్తే ఆత్మహత్యలు నిరోధించవచ్చు: రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య మైక్రో ఫైనాన్సు(సూక్ష్మ రుణాలు) ఆగడాలను అరికట్టేందుకు ఉపక్రమించేరు. ఆయన గురువారం పలు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. సూక్ష్మ రుణాల సంస్థల ఆగడాలు శృతిమించుతున్నాయని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని ఆదేశించారు. ఇందుకు వారికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నట్లు చెప్పారు.

బ్యాంకులే సూక్ష్మ రుణాలు ఆగడాలకు కారణమని రోశయ్య వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులు అందరూ రుణాలు పొందేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 30 శాతం రుణాలు మాత్రమే లబ్దిదారులు తీసుకున్నారని మిగతా రుణాలు కూడా సాథ్యమైనంత త్వరగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరీంనగర్ లోని సిరిసిల్ల తరహా ప్యాకేజీని మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందరికీ రుణాలు సక్రమంగా అందితే ఆత్మహత్యలు నిరోధించవచ్చునని ఆయన కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X