కామన్ వెల్త్ లాస్ట్ మినిట్ ఘనతంతా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిదే

ఈ సమావేశం తర్వాత ఏర్పాట్ల విషయంలో ఏ లోపాలున్నా, కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైకేల్ ఫెన్నన్ నేరుగా జైపాల్ రెడ్డిని కానీ చంద్రశేఖర్ను కానీ కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రధాన నిర్ణయాల్లో కల్మాడీ ఎవర్నీ సంప్రదించలేదని తేలడంతో అప్పటి నుంచీ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలను జైపాల్ భుజస్కంధాలపై పెట్టాలని నిర్ణయించారు. దీనితో జైపాల్ రెడ్డి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, లెఫ్టినెంట్ గవర్నర్ తేజేందర్ ఖన్నా, హోంమంత్రి చిదంబరం, విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ, క్రీడల మంత్రి గిల్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా ఢిల్లీ ప్రభుత్వ తప్పిదం వల్లనే క్రీడల నిర్వహణకు వారం రోజుల ముందు ఒక వంతెన కూలిందని, అదొక్కటే తమకు మచ్చగా మిగిలిందని షీలా దీక్షిత్ అంగీకరించారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి ప్రధానితో మాట్లాడి సైన్యాన్ని దించడం ద్వారా వంతెనను ఆరు రోజుల్లో నిర్మించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రీడలు జరిగిన పది రోజులూ జైపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించడం గమనార్హం.












Click it and Unblock the Notifications