బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం

వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి బులెటిన్లో వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా పలాస, రణస్థలంలో అత్యధికంగా 5 సెం.మీల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications