బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం

Bay of Bengal
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం దాటింది. పూరీకి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్‌ గఢ్, ఉత్తరాంధ్రకు సమీపంలో భూ ఉపరితలంపై విస్తరించి మరింత బలహీనపడనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా పలాస, రణస్థలంలో అత్యధికంగా 5 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+