Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆగని దేవరగట్టు కర్రల సమరం: 90 మందికి గాయాలు

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా జరిగే బన్ని ఉత్సవం ఆదివారం రాత్రి యథావిధిగా సాగింది. కర్రల సమరాన్ని ఆపడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కర్రల సమరంలో దాదాపు 90 మంది దాకా గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి వివిధ గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకోవడం దసరా రాత్రి ఆనవాయితీగా వస్తోంది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, అరికెర, ఎల్లార్తి, సుళువాయి, అరికెర తండా, ఆలూరి గ్రామాల ప్రజలు మాల మల్లేశ్వరస్వామిని తమ గ్రామాలకు తరలించేందుకు కర్రల సమరాన్ని చేశారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉత్సవంలో ఇనుప తొడుగులు లేని కర్రలను వాడాలని పోలీసులు చేసిన సూచనలు భక్తులు పెడచెవిన పెట్టారు. కర్రల సమరాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి దాదాపు లక్ష మందికి పైగా హాజరయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తంతును ఆపడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవేవీ ఫలించడం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+