నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ క్యాంప్ పై భగ్గుమంటున్న ఆనం సోదరులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర సాగుతుండగా కాంగ్రెసులోని ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓదార్పు యాత్రకు దూరంగా ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డిపై వైయస్ జగన్ వర్గం నిప్పులు చెరుగుతోంది. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్న ఆనం సోదరులు తర్వాత దూరమయ్యారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి తాము ఓదార్పు యాత్రలో పాల్గొనడం లేదని వారు స్పష్టం చేశారు. దానికితోడు కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు మరోసారి వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. వైయస్ అంత ప్రజాదరణ గల నాయకుడైతే 2004కు ముందు ఎందుకు ఓడిపోయామని ఆయన అడిగారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు ఆనం సోదరులపై తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో వారు పాల్గొనకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. బహిష్కృత కాంగ్రెసు నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వారిపై మండిపడుతున్నారు. వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనకు ఆనం సోదరులు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఓదార్పు యాత్రకు రూపొందించిన పోస్టర్లపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు పెట్టకపోవడంపై ఆయన ఇటీవల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వారి ఫొటోలు పెడితే దుర్వ్నియోగం చేస్తున్నారని, వారి ప్రజాదరణను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు రావచ్చునని ఆయన అన్నారు. మొత్తం మీద, నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర పార్టీలోని ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X