రోశయ్య ఢిల్లీ యాత్ర: పార్టీ ఇంచార్జీగా వీరప్ప మొయిలీకి ఎసరు

మొయిలీ మార్పుతో వైయస్ జగన్ కు చెక్ పెట్టే పనికి శ్రీకారం చుట్టాలనేది రోశయ్య ఆలోచనగా చెబుతున్నారు. మొయిలీని రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా తొలగించిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. తద్వారా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ తన మాటను కూడా బేఖాతరు చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డిని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను మంత్రివర్గం నుంచి తొలగించడానికి మార్గం ఏర్పడుతుందని రోశయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా నవంబర్ 2వ తేదీనే వైయస్ జగన్ కు కూడా కీలకం కానుందనే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనే మాట వినిపిస్తోంది. అయితే, అది ఇప్పుడే ఉండకపోవచ్చునని తెలుస్తోంది. డిసెంబర్ తర్వాతనే వైయస్ జగన్ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయానికి వస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications