హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ వల్లే తెలంగాణ ఆగిపోయింది: కాంగ్రెసు నేత కెఆర్ ఆమోస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పార్టీ అధిష్టానం తెలంగాణను ప్రకటించిందని అయితే దానిని అడ్డుకున్నది రాజశేఖర్ రెడ్డియేనని కాంగ్రెస్ నాయకుడు కెఆర్ ఆమోస్ అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి వైయస్ అలాంటప్పుడు ఆయన ఫోటో పెట్టుకొని తెలంగాణ అమర వీరుల సంస్మరణ సభ ఎలా జరుపుతామని ఆయన ప్రశ్నించారు.

మహబూబ్ నగర్ ఘటన పిరికి పందల చర్యగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు. మహబూబ్ నగర్లో చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభ కాదని, అది తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభ అని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X