జగన్ సాక్షి కోసం రూ. 600 కోట్లు వసూలు చేశాడు: శంకరరావు

కాంగ్రెస్ పార్టీ జగన్ వల్ల బతికలేదని, కాంగ్రెస్ వల్లే ఆయన బతుకుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ శ్రేయోభిలాషుల నుండి సుమారు 600 కోట్లు రూపాయలు వసూలు చేసి సాక్షి పత్రిక పెట్టారని ఆరోపించారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో నిరూపించడానికి సిద్ధమని ప్రకటించాడు. 15 ఏళఅల క్రిందటి వైయస్ కుటుంబం ఆస్తులు ఎంత ఇప్పటి ఆస్తులు ఎంతో ప్రజలందరికీ తెలుసునన్నారు.
అలాంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్నాయన్నారు. కాంగ్రెస్ లోనే ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే వార్తలు రాయటం దారుణమన్నారు. దీంతో ప్రతిపక్ష పాత్ర పోషించినట్లుగా కనిపిస్తోందన్నారు. మంత్రులు పదవులు పోతాయనే ఓదార్పులో పాల్గొనటం లేదనటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వాఖ్యలు చేస్తే ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications