రాజకీయ పార్టీల అధ్యక్షులకు నవంబర్ లో శ్రీకృష్ణ కమిటీ విందు

Srikrishna Committee
హైదరాబాద్‌: రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు విందు ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ నిర్ణయించుకుంది. నవంబర్ మూడో వారంలో వారికి విందు ఇవ్వాలని కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 18, 24 తేదీల మధ్య ఈ విందు సమావేశం ఏర్పాటు కానుంది. రాజభవన్ లో ఈ విందు సమావేశం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల్లో డిసెంబర్ టెన్షన్ జోరందుకున్న సమయంలో ఈ విందుకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు. ఈ విందులో రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కూడా పాల్గొంటారు. కొంత మంది ముఖ్యులను కూడా ఈ విందుకు ఆహ్వానిస్తారు.

తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలపడానికి మర్యాదపూర్వకంగానే శ్రీకృష్ణ కమిటీ ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, డి. శ్రీనివాస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో ఇష్టాగోష్టిగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారా అనేది చర్చనీయాంశంగానే మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+