వైయస్ జగన్ సాక్షి డైలీకి వి హనుమంతరావు షాక్
"గతంలో ఆంధ్రజ్యోతి, ఈనాడులను చదవొద్దని, అవి కాంగ్రెస్కు వ్యతిరేకంగా రాస్తాయని, వాటిని చింపేయాలని వైఎస్ అనలేదా? మేము కూడా అదే అంటం..వైఎస్ బతికుంటే కూడా ఈ రాతలకు బాధపడేవారు. కాంగ్రెస్ పేరు మీద బతుకుతూ కాంగ్రెస్ ను తిట్టేటందుకు ఉన్నారా భాయ్ మీరు..? నేను మీతో ఇప్పుడే కాదు, ఎప్పుడూ మాట్లాడను.. వెళ్లండి!" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కూడా ఆయన ఆగ్రహం ఆపుకోలేకపోయారు. "హనుమంతరావు తిట్టిండు, ఎగిరిండు, దుంకిండు.. అని రాశారు. నా పేరే హనుమంతరావు..అలా రాయడం తప్పు కదా..ఎవరెవరితోనో అమ్మను, పెళ్లాన్ని తిట్టిపిస్తరు. ఎవరు తిడ్తే దాన్ని రాస్తరు" అని ధ్వజమెత్తారు.
నాడు వైఎస్ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది తానేనని వీహెచ్ అన్నారు. "నేను నిన్నమొన్నటి లీడర్నా.. 1970 నుంచి ఉన్నా, వైఎస్ కంటే నేనే సీనియర్ని. నేనేమన్నా వారికి వ్యతిరేకం చేశానా? హైకమాండ్ ఎలా చెబితే అలా మాట్లాడతా.. ఇలాగే రాస్తే సాక్షి పేపర్ మనది కాదు భాయ్.. అని కాంగ్రెసోళ్లకు చెబుతా.." అన్నారు. "లేనిపోనివి రాయడమే ఎల్లో జర్నలిజం.. మహబూబ్నగర్లో జరిగిన దాని గురించి ఒక్క అక్షరం కూడా వాస్తవం రాశారా?" అని మండిపడ్డారు.