చంద్రబాబుపై అలిపిరి వద్ద నక్సలైట్ల దాడి: ఆ రోజు అసలేం జరిగింది?

Alipiri Attack on Chandrababu
హైదరాబాద్: అది 2003 అక్టోబర్ 1వ తేదీ. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తుండగా అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు, ఇప్పటి మావోయిస్టులు బాబు దాడి చేశారు. చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారును నక్సలైట్లు శక్తివంతమైన క్లైమోర్ మైన్స్ తో పేల్చివేశారు. ఆ సంఘటన ఆ రోజు 4 గంటల 20 నిమిషాలకు జరిగింది. ఘాట్ రోడ్డులోని అలిపిరి టోల్ గేట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటి క్రితమే ఆయన ఓసారి తిరుమల వెళ్లి వచ్చారు కూడా.

బాంబు పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దాడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కారు పేలిపోయి ఓ రాయికి తాకి పల్టీ కొట్టింది. సంఘటనా స్థలంలో మరో రెండు బాంబులు లభించాయి. అత్యంత పకడ్బందీగా రూపొందించుకున్న పథకం మేరకే నక్సలైట్లు ఈ దాడి చేశారని స్పష్టంగా అర్థమైంది. ఈ దాడిలో గాయపడిన చంద్రబాబును చికిత్స నిమిత్తం హైదరాబాదు తరలించారు. ఈ దాడిలో చంద్రబాబుతో పాటు అప్పటి ఐటి శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి కూడా గాయపడ్డారు. వారంతా గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

కాగా, ఈ కేసులో ప్రస్తుత మావోయిస్టు నేతలను చాలా మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి సహా అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ, హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు 33 మందిని నిందితులుగా చేర్చారు. పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ ఆ ఆగ్రనేతల్లో ఒకరు. మిగతా నిందితులు దొరకకపోవడంతో కేసును విభజించి విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం సాగర్ తో పాటు మరో ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+