హైదరాబాద్ కేంద్ర పాలితమనే వార్తలు నిజం కాదు: దుగ్గల్

VK Duggal
న్యూఢిల్లీ: హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రాంతంగా చేయాలని తాము కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ అన్నారు. ఆయన ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. తాము కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలు సూచిస్తామని వచ్చిన వార్తలు సరికాదని, ఆ మార్గాలను సూచిస్తామని చెప్పలేమని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాతో కలిపి హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ సూచించే అవకాశం ఉందని ఎకనమిక్స్ టైమ్స్ లో వచ్చిన వార్తపై తీవ్ర దుమారం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో సహా తెలుగుదేశం, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దానికి తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు శ్రీకృష్ణ కమిటీకి విన్నవించారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో సహా తెలంగాణ సమస్యపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలను సూచించనుందని 'ఎకనమిక్ టైమ్స్' పత్రికలో వార్త ప్రచురితమైంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలు సూచిస్తుందని, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరగవచ్చో లాభ నష్టాలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా వివరించనుందని ఈ పత్రిక వెల్లడించింది. అదేసమయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందున్న ఆప్షన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం లేదా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ తెలంగాణ, ఆంధ్రలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది కమిటీ ముందున్న మూడో ఆప్షన్. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిని తెలంగాణ సరిహద్దులకూ విస్తరించాలనే సూచనలు ఉండటం విశేషమని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+