వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను పూడ్చిపెట్టిన భర్త పోలీసులకు లొంగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: భార్య శవాన్ని వారం రోజుల క్రితం పాతిపెట్టిన భర్త శనివారం ఉదయం పోలీసులకు లొంగిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. నరేష్ అనే యువకుడు తన భార్య రజని శవాన్ని ఇంటి వద్ద గల ఖాళీ స్థలంలో వారం రోజుల క్రితం పూడ్చిపెట్టాడు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాదు గ్రామంలో జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవతో రజని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వీరిద్దరు మైనర్లని తెలుస్తోంది. ఆరు నెలల క్రితం వారిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాతి నుంచి వారు ఏదులాబాదులో ఉంటున్నారు.

నరేష్ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. అదే కళాశాలలో రజని స్వీపర్ గా పనిచేస్తోంది. వారిద్దరి మధ్య ఆ మధ్య కాలంలో గొడవ జరిగినట్లు సమాచారం. నరేష్ ఓ రోజు కళాశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రజని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో భార్య శవాన్ని ఇంటి వద్ద ఖాళీ స్థలంలో వారం రోజుల క్రితం పాతిపెట్టాడు. అయితే, దాన్ని భరించలేక నరేష్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే, నరేష్ రజనిని హత్య చేసి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X