నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదులు కాశ్మీరీ టెర్రరిస్టుల్లాంటివారు: ఆనం వివేకానందరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Vivekanda Reddy
నెల్లూరు: తెలంగాణవాదులను కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి కాశ్మీరీ టెర్రరిస్టులతో పోల్చారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను అడ్డుకునేవారు కాశ్మీరీ టెర్రరిస్టుల్లాంటివారని ఆయన అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని బహిష్కరించేవారు విద్రోహులని ఆయన అన్నారు. రాష్టావతరణ దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చినవారిపై ఆయన ధ్వజమెత్తారు.

రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహించడం ఇష్టం లేనివారు ఇంట్లో కూర్చోవాలని, అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్టావతరణ ఉత్సవాలు ప్రభుత్వ కార్యక్రమమని ఆయన అన్నారు. కాశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవాలకు, గణతంత్ర దినోత్సాలకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్న కాశ్మీర్ ఉగ్రవాదుల మాదిరిగానే రాష్ట్రావతరణ దినోత్సవాలకు ఆటంకం కలిగించేవారు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X