చంద్రబాబుది సమైక్యాంధ్ర జెండా: నాయిని నర్సింహారెడ్డి

ఆంధ్రవారితో కలిపి నవంబర్ 1వ తేదిన తెలంగాణ అన్యాయమైన రోజు కాబట్టి దీనిని విద్రోహ దినంగా పాటిస్తామన్నారు. ఆ రోజునుండి ఈ రోజు వరకు తెలంగాణకు అన్యాయం జరుగుందన్నారు. 610 జివో, పెద్దమనుషున ఒప్పందం, ఫజల్ అలీ కమిషన్ అన్నింటినీ విస్మరించి తెలంగాణను అణగదొక్కాయన్నారు. తెలంగాణవాదులను గాయపర్చేలా ఇప్పటి ప్రభుత్వం, ప్రతిపక్షం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వారు గుంటూరులో గుంటెడు, విజయవాడలె సెంటు భూమి ఆడగటం లేదని మా భూమి మాకు కావాలని అడుగుతున్నారన్నారు. తెలంగాణవారి ఆస్తులను కొల్లగొట్టిన కొందరు నాయకులే తెలంగాణను అడ్డుకుంటున్నారన్నారు.
మా ఉద్యోగాలు మాకు, మా నీళ్లు మాకు కావాలన్నారు. నిరంకుశ నిజాం మా నుండి బలవంతగా శిస్తులు కట్టించుకొని వీటిని కట్టించాడని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేకుంటే మేం ఏం చేయలేమని వారి ఖర్మ వారు అనుభవించాల్సిందేనని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్ పత్తా లేకుండా పోతుందన్నారు. త్వరలో బ్రహ్మాండమైన బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications