హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాంపల్లి కోర్టులో హాజరైన సత్యం రామలింగరాజు: విచారణ ప్రారంభం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కుంభకోణంలో ఇరుక్కున్న రామలింగరాజు మంగళవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. తుది విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనను సిబిఐ కోర్టులో హాజరు పరిచింది. 2011 జూలై 31 లోపల విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశించింది. దాంతో ఆయన తుది విచారణ ప్రారంభం కోసం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఈనెల 8వ తేది లోగా ఆయన లొంగి పోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ రోజునుండి నుంచి రోజువారి విచారణ జరుగుతుంది. మిగిలిన నిందితులను కూడా విచారిస్తారు.

అంతకుముందు తనకు బెయిల్ కావాలని రామలింగరాజు పెట్టుకున్న పిటిషన్ కు హైకోర్టు ఆమోదించటంతో సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. రామలింగరాజు బెయిలుపై బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ చెప్పటంతో సుప్రీం కోర్టు రామలింగరాజుకు బెయిలును రద్దు చేసింది. వెంటనే విచారణ ప్రారంభించాలని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X