అసమర్థ ఎంపీల వల్లే నష్ట పరిహారం పొందలేకపోయాం: చిరంజీవి

రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ వచ్చే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. ఎలాంటి ఉపద్రవం వచ్చినా మారు ఫరవాలేదని ప్రభుత్వం, అధికారులు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వారికి కిరోసిన్, బియ్యం, పప్పువంటి నిత్యావసర వస్తువులు వెంటనే సరఫరా చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతుల వివరాలను రెవెన్యూ డిపార్టుమెంట సేకరించి సహాయం అందించాలన్నారు. రైతులను కలిసి మాట్లాడానని ఆక్కడ వారి పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుసుకున్నానన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి వరద సహాయక చర్యలపై ఒత్తిడి తీసుకు వస్తామని చిరంజీవి చెప్పారు. నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపుతామన్నారు. ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు ముంపు బాధితులను ఆదుకోవాల్సిందిగా సూచించానని చెప్పారు.












Click it and Unblock the Notifications