హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏఐసిసిలో పివి ఫొటో పెట్టకపోవటం తెలుగువారికి అవమానం: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ(ఏఐసిసి) సమావేశాల్లో దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఫొటో పెట్టకపోవడం తెలుగు వారిని అవమానించటమేనని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. భారత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ఆ స్థితినుండి తప్పించారన్నారు. అలాంటి వ్యక్తి ఫొటో పెట్టక పోవటం తెలుగు జాతిని యావత్తు కించపరిచినట్లేనన్నారు. ఎప్పుడు తెలుగు వారి అండతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచే కాంగ్రెసు, వారికి ప్రాధాన్యత ఇవ్వటంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుందన్నారు.

కాంగ్రెసు అంటే ఆల్ ఇండియా కరప్టెడ్ కాంగ్రెసు అని ఆయన వాఖ్యానించారు. కాగా ఇటీవల కాంగ్రెసు వారు తెలుగు దేశంలోని టిడిపి పదాలను ఉచ్చరిస్తూ వారు కామెంటు చేసిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా గాలి ఏఐసిసిని ఆల్ ఇండియా కరప్టెడ్ కాంగ్రెసు అని సంభోదించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X