డిసెంబర్ తర్వాత సీమాంధ్ర ఛానళ్లు మరింత కుట్ర చేస్తాయి: కెసిఆర్

తెలంగాణ ఎస్సైలకు ప్రభుత్వం ప్రమోన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్లజ్జగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు, కష్టాలు తీరాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. అందుకోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం వివిధ పార్టీలనుండి ప్రజలు తెరాసలోకి భారీగా చేరుతున్నారని ఆయన అన్నారు.
కొన్ని ఛానళ్లు పని గట్టుకొని తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దిక్కుమాలిన కథనాలు ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయన్నారు. కట్టుకథలు, పిట్టకథలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ఓ ఛానల్ హైదరాబాద్ కూలిపోతుందని ప్రచారం చేస్తే, మరో ఛానల్ వరంగల్ నాశనమవుతుందని పోటాపోటీగా ప్రసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉండలనే చిత్థశుద్ధి ఉంటే ఆ ఛానళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల వరకు సీమాంధ్ర ఛానళ్లు ఇష్టమున్నట్టు ప్రసారం చేస్తాయని అయితే ఆ తర్వాత మన ఛానల్ ఆ ఛానళ్ల గుట్టు బయట పెడుతుందని అన్నారు. ఇప్పుడు ఛానళ్లు తెలంగాణపైన దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది 31 తర్వాత మరింత ఎక్కువ అవుతుందని ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications