తుఫాను గండం తప్పింది, వర్షాలకు భారీ నష్టం తప్పలేదు

Heavy Rains
హైదరాబాద్‌: రాష్ట్రానికి తుఫాను గండం తప్పింది. అయితే భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టమే వాటిల్లింది. రైతులు విపరీతంగా నష్టపోయారు. కొన్ని జిల్లాల్లో పంట మునక మాత్రం తప్పలేదు. ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెన్నైకి ఉత్తరంగా 60 కి.మీ.ల దూరంలో జల్‌ తుపాను తీరం దాటిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆ తర్వాత ఇది మరింత బలహీనపడుతూ పశ్చిమ వాయువ్యదిశగా కదిలి... అనంతపురానికి ఈశాన్యంగా 50 కి.మీ.ల దూరంలో కొనసాగింది. అక్కడ్నుంచి సోమవారం సాయంత్రానికి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి తరలిపోయిందని అధికారులు తెలిపారు. అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి, అరేబియా సముద్రంలోకి వెళ్లి మళ్లీ బలోపేతమయ్యే అవకాశాలున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి అది అల్పపీడనంగా కొనసాగుతోంది. తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో చెదురుమదురుగా వానలు కురిశాయి. తమిళనాడులో మాత్రం వర్షాల్లేవు. హైదరాబాద్‌తో పాటు రాయలసీమలోని పలుచోట్ల జల్లులు పడ్డాయి. అనేకచోట్ల ముసురుపట్టింది. చలి తీవ్రత అధికంగా ఉంది. చలిగాలులకు సోమవారం నెల్లూరుజిల్లాలో 11 మంది, ప్రకాశంజిల్లాలో ముగ్గురు చనిపోయారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంవల్ల రాయలసీమల్లో పలుచోట్ల, తెలంగాణలో మంగళవారం రాత్రివరకు తేలికపాటి వర్షాలు కురవొచ్చు.

రాష్ట్రంలో గత 9 రోజులుగా కురిసిన వర్షాలకు మొత్తం 8 లక్షల ఎకరాల్లోని పంటలు మునిగిపోయినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మరో మూడ్నాలుగు రోజుల పాటు ఇదేస్థాయిలో వర్షాలు కొనసాగితే పంట నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే మునిగిపోయిన పంటలతో 8.08 లక్షల టన్నుల ఉత్పత్తి కోల్పోయామని, వీటి విలువ రూ.672.48 కోట్లు ఉంటుందని నిర్ధరించింది. పంటలు కోల్పోయిన రైతులకు తక్షణ సాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ)గా ఇచ్చేందుకు రూ.143.53 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ కమిషనర్‌ సునీల్‌శర్మ కోరారు. అక్టోబరు 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకూ కురిసిన వర్షాలకు 13 జిల్లాల్లో పంటలు మునిగిపోయాయి. కానీ అంతకుముందు అక్టోబరు 21 నుంచి 30 వరకూ కురిసిన వర్షాలనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 16 జిల్లాల్లో పంటలు మునిగాయని ఆయన తెలిపారు.

నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల నుంచి అదనంగా పంటలు మునిగినట్లు సమాచారం అందుతోంది. వీటి సమాచారం మంగళవారం ప్రభుత్వానికి అందనుంది. తుపాను కారణంగా చాలా జిల్లాల్లో అడపాదడపా జల్లులు, చిన్నపాటి వర్షాలు పడుతుండటంతో నేలలు చిత్తడిగా మారి పత్తి, మిరప, పప్పు ధాన్యాల వంటి పైర్లు దెబ్బతింటున్నాయి. వీటిని పూర్తిగా పంటలు మునిగిపోయిన జాబితాలో చూపటం లేదు. కానీ ఈ పంటల నుంచి దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+