హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ లో సహనం నశించాలనే హైకమాండ్ కోరుకుంటోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లో సహనం కోల్పోవాలనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం కోరుకుంటోందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీ అధిష్టానం నుంచి తనపై చర్యలను వైయస్ జగన్ ఆశిస్తుండగా, జగన్ సహనం కోల్పోయి తీవ్ర నిర్ణయం తీసుకోవాలని హై కమాండ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ పై చర్యలు తీసుకుంటూ ఆయనను రెచ్చగొట్టే ఎత్తుగడను కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన ప్రకటన ఈ విషయాన్నే తెలియజేస్తోంది. తాను సహనం కోల్పోతే ఉప్పెన పుడుతుందని జగన్ నెల్లూరు ఓదార్పు ముగింపు సభలో చేసిన ప్రకటనపై ఆయన వ్యంగ్యంగా ప్రతిస్పందించారు. జగన్ సహనం కోల్పోవడం ఇది ఏడో సారి అని ఆయన అన్నారు.

జగన్ కు వ్యతిరేకంగా మరో కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. అధిష్టానం మాత్రం వైయస్ జగన్ వ్యవహారం పట్ల మౌనంగా ఉంటుంది. గుర్తిస్తే వైయస్ జగన్ మరింత రెచ్చిపోతారని, అందువల్ల వైయస్ జగన్ చర్యలను గుర్తించకుండా ఉండడమే మంచిదని అధిష్టానం భావిస్తూ మరో వైపు రెచ్చగొట్టేలా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని జగన్ వ్యతిరేకులతో ప్రకటనలు చేయిస్తూ జగన్ ను, జగన్ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేయడం కాంగ్రెసు అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహంగా చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X