మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుగ్గల్ కు సుబ్బిరామిరెడ్డి విందు అనుమానాలకు తావిస్తోంది: హరీష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
మెదక్: శ్రీకృష్ణ కమిటీలోని సభ్యుడు వి కె దుగ్గల్ సీమాంధ్ర నాయకుడు, పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన విందుకు వెళ్లడం తెలంగాణ ప్రజలలో అనుమానాలకు తావిస్తుందని సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు అన్నారు. దుగ్గల్ తాను సుబ్బిరామిరెడ్డి విందుకు వెళ్లినందున తెలంగాణ ప్రజలకు తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువుకు మరో రెండు నెలలే ఉన్నందున దుగ్గల్ అలా వెళ్లడం పద్ధతి కాదన్నారు.

ప్రభుత్వం సీమాంధ్ర వరదల పంట నష్టాన్ని అంచనా వేసినట్టుగానే తెలంగాణ జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలోని చాలామంది రైతులు వర్షాల వల్ల పంటను నష్టపోయారని, ప్రభుత్వం వారని వెంటనే ఆదుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ద్వందనీతిని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే చీఫ్ సెక్రటరీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలమంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు. 610 జీవో ప్రకారం వెంటనే ఎస్సై, సిఐలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X