వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీని ఎవరూ ప్రలోభ పెట్టరు: లగడపాటి రాజగోపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డి శ్రీకృష్ణ కమిటీ సభ్యుడైన దుగ్గల్ కు విందు ఇవ్వడాన్ని ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీని ఎవరో ప్రలోభ పెడతారనే అనుమానాలు ఉట్టివేనన్నారు. దుగ్గల్ సహజంగానే విందుకు హాజరయ్యాడని, ఎలాంటి దురుద్దేశ్యాలతో హాజరు కాలేదని చెప్పారు. ఇంతకుముందు తెలంగాణ నాయకులు ఏర్పాటు చేసిన అనేక ప్రయివేటు కార్యక్రమాలకు కమిటీ సభ్యులు హాజరయ్యారని, ఆ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు తప్పకుండా జాతీయ హోదా వస్తుందని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరంపై పర్యావరణ పరిరక్షణ సమితికి ఉన్న అనుమానాలన్నింటినీ ప్రభుత్వం సమాధానం ఎప్పుడో చెప్పిందన్నారు. అందుకే పర్యావరణ సమితినుండి అనుమతులు కూడా ఎప్పుడో వచ్చాయన్నారు. అయితే పోలవరానికి జాతీయహోదా రావడానికి గల కారణాలు నిధుల లేమి అని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం పోలరానికి ప్రత్యేక నిధులు కేటాయించి జాతీయ హోదాను కల్పిస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X