హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కష్టాల్లో ఉన్నప్పుడు బాలయ్యను నేను అదుకున్నాను: లక్ష్మిపార్వతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: కష్టాల్లో ఉన్నప్పుడు తాను సినీ నటుడు బాలకృష్ణను ఆదుకున్నానని స్వర్గీయ ఎన్టీ రామరావు సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడి బాలకృష్ణను ఆదుకున్నట్లు ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బాలకృష్ణకు శిక్ష వేయవద్దని తాను ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె తెలిపారు. బాలకృష్ణను తన వారసుడిగా ఎన్టీఆర్ ప్రకటిస్తే తెలుగుదేశం ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించినట్లు ఆమె తెలిపారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ తనయులే ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె సూచించారు. ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబు పార్టీకి దూరం చేశారని ఆమె విమర్శించారు. పథకం ప్రకారం పార్టీ నాయకులను ఎన్టీఆర్ కు దూరం చేశారని ఆమె విమర్శించారు.

చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ కుమిలిపోయారని ఆమె చెప్పారు. అచేతన స్థితిలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ నుంచి రాజీనామా లేఖ తీసుకున్నారని ఆమె అన్నారు. బిజెపి హవా వల్లనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ మాటలు పడ్డారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అన్ని రకాలుగా నిర్వీర్యం చేశారని, ఎన్టీఆర్ బ్రెయిన్ దెబ్బ తింటుందని చంద్రబాబు తెలిసినా వెన్నుపోటుకు వెనుదీయలేదని ఆమె అన్నారు. తనపై వ్యతిరేకతతోనే కర్నూలు ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎస్వీ సుబ్బారెడ్డిని ఓడించారని ఆమె విమర్సించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆమె అన్నారు.

చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు గ్రూపులను దగ్గర చేయడానికి తాను ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. పార్టీలోకి ముందు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావును పక్కన పెట్టి చంద్రబాబుకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబుకు అధికార మదపిచ్చి పట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతికి అంతం లేకుండా పోయిందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X