కష్టాల్లో ఉన్నప్పుడు బాలయ్యను నేను అదుకున్నాను: లక్ష్మిపార్వతి
చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ కుమిలిపోయారని ఆమె చెప్పారు. అచేతన స్థితిలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ నుంచి రాజీనామా లేఖ తీసుకున్నారని ఆమె అన్నారు. బిజెపి హవా వల్లనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ మాటలు పడ్డారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు అన్ని రకాలుగా నిర్వీర్యం చేశారని, ఎన్టీఆర్ బ్రెయిన్ దెబ్బ తింటుందని చంద్రబాబు తెలిసినా వెన్నుపోటుకు వెనుదీయలేదని ఆమె అన్నారు. తనపై వ్యతిరేకతతోనే కర్నూలు ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎస్వీ సుబ్బారెడ్డిని ఓడించారని ఆమె విమర్సించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆమె అన్నారు.
చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు గ్రూపులను దగ్గర చేయడానికి తాను ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. పార్టీలోకి ముందు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావును పక్కన పెట్టి చంద్రబాబుకు ప్రాధాన్యం ఇచ్చారని ఆమె అన్నారు. చంద్రబాబుకు అధికార మదపిచ్చి పట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతికి అంతం లేకుండా పోయిందని ఆమె అన్నారు.