హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణను ఎవరూ తాకట్టు పెట్టలేరు: కెసిఆర్ పై గద్దర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి సంగతి తెలియదు గానీ ప్రస్తుతం తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ తాకట్టు పెట్టలేరని ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. కాంగ్రెసును బలోపేతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ప్రజా ఉద్యమంగా మారిందని, దాన్ని ఎవరూ తాకట్టు పెట్టలేరని ఆయన అన్నారు. కెసిఆర్ తో మిత్ర వైరుధ్యం ఉంటుందని, కెసిఆర్ తో ఐక్యతా పోరాటమూ ఉంటాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజా ఉద్యమాలతో అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న తరుణంలో శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ రాజకీయ నాయకుల ఇళ్లకు వెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వివిధ ప్రాంతాల అభిప్రాయాలను మాత్రమే ఇవ్వగలదని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కెసిఆర్, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు తాము పార్లమెంటు సభ్యుల ఇళ్ల ముందు శాంతియుతంగా ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు సార్లు తెలంగాణను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ పట్ల తెలుగుదేశం, కాంగ్రెసు రెండు పార్టీలు ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X