హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాను విమర్శించి పెద్దవాళ్లవుతారా?: సుదర్శన్ పై రోశయ్య నిప్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ అనుచిత విమర్శలు చేసి పెద్దవాడినై పోదామని అనుకుంటున్నారని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. అలా అనుకోవడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. సోనియాపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సుదర్శన్‌ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేంగా శుక్రవారం హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడారు. సోనియాను విమర్శించడం ద్వారా పెద్దవారు కావాలని ఎవరైనా అనుకుంటే అది క్షమించరాని నేరమని రోశయ్య అన్నారు. మహాత్మా గాంధీని చంపినవారు సోనియాపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోనియాపై ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ చేసిన వ్యాఖ్యలను ప్రతి భారతీయుడూ ఖండించాలని ఆయన కోరారు.

సోనియా త్యాగాలకు మారుపేరు అని ఆయన అన్నారు. విమర్శలు చేసే ముందు హద్దులు గుర్తుంచుకోవాలని ఆయన ఆర్ఎస్ఎస్ నేతకు సూచించారు. పొగడడం ఎలాగూ చేత కాదు, విమర్శలు చేయవద్దని ఆయన అన్నారు. రాజకీయంగా ఏమీ చేయలేకనే సోనియాపై సుదర్శన్‌ వ్యాఖ్యలు చేశారని డీఎస్‌ అన్నారు. సుదర్శన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే సోనియాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీల హత్యకు సోనియానే కుట్రపన్నారని ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X