తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్య ధర్నా అభ్యంతరకరమే: ప్రజారాజ్యం నేత చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: ముఖ్యమంత్రి కె. రోశయ్య హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ధర్నా చేయడం అభ్యంతరకరమేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. నిషేధిత ప్రాంతంలో ముఖ్యమంత్రి ధర్నా చేయడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆర్ఎస్ఎస్ నేత సుదర్శన్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెసు తలపెట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొన్న విషయం తెలిసిందే. తుఫాను సహాయక చర్యలను ప్రభుత్వం మందకొడిగా సాగిస్తోందని చిరంజీవి విమర్శించారు. చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని ఆయన కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఈ నెలాఖరును మరోసారి తాను ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుస్తానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కదలాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై ఒరిస్సా రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు రాజకీయ ఆటంకాలే ఉన్నాయి గానీ సాంకేతిక ఆటంకాలు లేవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X