వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాఖీ సావంత్ కొజ్జా అనండం వల్ల ఓ వ్యక్తి మృతి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rakhi Sawant
లక్నో/ఝాన్సి: ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే ఐటం బాంబు రాఖీ సావంత్‌ ఈసారి ఓ వ్యక్తి మృతి కేసులో చిక్కుకున్నారు. ఆమె ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన 'రాఖీ కా ఇన్సాఫ్‌' కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ ప్రసాద్ అనే వ్యక్తి ఇటీవల మృతిచెందాడు. ఇందుకు రాఖీతో పాటు మరో ముగ్గురిని కారణంగా పేర్కొంటూ మృతుడి తల్లి సావిత్రి దేవి ఫిర్యాదు చేశారని సీనియర్‌ ఎస్పీ వినోద్‌కుమార్‌ దొహ్రే తెలిపారు. ఆ కార్యక్రమంలో రాఖీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన లక్ష్మణ్‌ క్రమేనా తిండి నిద్రలుమాని అనారోగ్యంతో మృతిచెందాడని ఆమె ఫిర్యాదులో తెలిపారన్నారు. రాఖీతో పాటు మరో ముగ్గురిపై ఝాన్సి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు.

మృతుడు లక్ష్మణ్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో గల ప్రేమ్ నగర్ పట్టణానికి చెందినవాడు. తన కుమారుడిని రాఖీ సావంత్ కొజ్జా అని వ్యాఖ్యానించిందని సావిత్రి అహిర్వాల్ ఆరోపించింది. రాఖీ సావంత్ వ్యాఖ్యలకు ఇరుగు పొరుగు వారు తన కుమారుడిని అపహాస్యం చేశారని ఆమె చెప్పింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆహార పానీయాలు మానేశాడని, దాంతో మరణించాడని ఆమె అన్నది. అక్టోబర్ లో ప్రసాద్, అతని భార్య, కుటుంబ సభ్యులు రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X