విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వల్లభనేని వంశీకి, మద్దెలచెర్వు సూరికి వైరం ఎందుకు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ తెలుగుదేశం విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి మధ్య ఉన్న వైరం ఏమిటో, సంబంధం ఏమిటో తమకు తెలియదని విజయవాడ పోలీసులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. దీనిపై అనంతపురం జిల్లా నుంచి వివరాలు సేకరించుకోవాలని వారు అందులో సూచించినట్లు చెబుతున్నారు. సూరి నుంచి తనకు ప్రాణహాని ఉందని వంశీ ఆరోపించిన విషయం తెలిసిందే. విజయవాడలో వంశీకి ఏ విధమైన ప్రాణహాని లేదని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ నుంచి గానీ బాజీ ప్రసాద్ నుంచి గానీ వంశీకి ప్రాణహాని లేదని విజయవాడ పోలీసులు తమ నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ తనపై తానే దాడి చేసుకోవచ్చునని, గన్ మెన్ కోసం వంశీ అలా చేసే అవకాశం ఉందని విజయవాడ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. వంశీ భద్రతకు సంబంధించి ఏ విధమైన అందోళన అవసరం లేదని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X