బెజవాడ సీపీ రామాంజనేయులుపై టీడీపీ వల్లభనేని వంశీ ఫైర్

నాకు హైదరాబాదులో ఏదైనా ప్రాణహాని జరిగితే ఆ బాధ్యత విజయవాడ సిపికి ఉండదా అన్నారు. అయితే తనకు ప్రాణహాని ఉందని, కాని ప్రాణభయం లేదన్నారు. నెహ్రూ, ముసునూరి సుబ్బారావు, అరవ సత్యంలను పిలిపించి మాట్లాడని సిపి తెలుగుదేశం నాయకులను కౌన్సిలింగ్ పేరుతో పిలవటం వెనుక నెహ్రూ రాజకీయ ప్రయోజనాలు కాపాడటం కోసమేనా అని ప్రశ్నించారు.
విజయవాడ సిపి రామాంజనేయులు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు బాడీగార్డులను ఉపసంహరించున్న విషయం తెలిసిందే. దేవినేని ఉమకు కొందరు బాడీగార్డులను ఉపసంహరించిన సిపి, వల్లభనేని వంశీకి మాత్రం మొత్తానికి మొత్తం ఉపసంహరించాడు. దీంతో వల్లభనేని సిపిపై నిప్పులు గక్కాడు. సిపి నెహ్రూకి వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు.












Click it and Unblock the Notifications