నెల్లూరు జిల్లాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
వెంకటగిరి - యేర్పేడు మార్గంలో పొంగూరు వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కనిగిరి రిజర్వాయర్ లో కూడా నీట మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఎస్పీ ప్రజలను కోరుతున్నారు. బోగ సముద్రం వాగులో ఏడుగురు కొట్టుకుని వచ్చారు. ఓ చెట్టును పట్టుకుని తమను రక్షించాలని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని కేవీబీపురం మండలం కాళంగి రిజర్వాయర్కు నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ఉద్ధృతి కారణంగా ఆదరం, జయలక్ష్మీపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలో కూడా ఎడ తెగకుండా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడులో తీరాన్ని దాటింది. తిరుపతిలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
Comments
Story first published: Wednesday, November 17, 2010, 9:06 [IST]