అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ గణం అల్లరి: రాజీనామా చేస్తానంటూ రోశయ్య బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనంతపురం: పుట్టపర్తి ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్ ని అడ్డుకొని రాజీనామా చేయాలంటూ సోమవారం డిమాండ్ చేశారు. సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే రోశయ్య వారిపై ప్రతిదానికి రాజీనామా చేయాలనటం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేస్తే రాజీనామా చేస్తానని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పుట్టపర్తి ఎయిర్ పోర్టులోనికి వెళ్లిన తర్వాత వారు లోపలికి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతామని మమ్మల్ని లోపలికి పంపించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గుర్తింపునివ్వాలని వారు రోశయ్యను కోరారు. స్థానిక ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వారు సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సత్యసాయిబాబా దర్శనం కోసం 11 గంటల సమయంలో పుట్టపర్తి రానున్నారు. ఆయనను ఆహ్వానించేందుకు రోశయ్య ఎయిర్ పోర్టులో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X