వైయస్ జగన్ గణం అల్లరి: రాజీనామా చేస్తానంటూ రోశయ్య బెదిరింపు
ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతామని మమ్మల్ని లోపలికి పంపించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన గుర్తింపునివ్వాలని వారు రోశయ్యను కోరారు. స్థానిక ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, పలువురు జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రిని ఆహ్వానించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వారు సిఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సత్యసాయిబాబా దర్శనం కోసం 11 గంటల సమయంలో పుట్టపర్తి రానున్నారు. ఆయనను ఆహ్వానించేందుకు రోశయ్య ఎయిర్ పోర్టులో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా బాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చారు.
Comments
రోశయ్య శైలజానాథ్ మన్మోహన్ సింగ్ యెడ్యూరప్ప అనంతపురం rosaiah sailajanath puttaparthi manmohan singh yeddyurappa anantapur
Story first published: Monday, November 22, 2010, 10:54 [IST]