వైయస్ జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీ రావాలా: ముఖ్యమంత్రి రోశయ్య

తనకు ఎవరిపై అసహనం, కోపం లేవని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో భేటీలో వైయస్ జగన్ వ్యవహారంపై గానీ మంత్రివర్గ విషయం గానీ మాట్లాడబోనని ఆయన చెప్పారు. చిరంజీవి పర్యటనతో తనను ముడిపెట్టవద్దని ఆయన అన్నారు. చిరంజీవి విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. తాను సోనియా, అహ్మద్ పటేల్, ఆంటోనీ, వీరప్ప మొయిలీలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం చెప్తే తాను మంత్రివర్గ విస్తరణ చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications