మఖ్యమంత్రిగా రెడ్డికే అవకాశం? వైయస్ జగన్ కు చెక్కు పెట్టేందుకే!

S Jaipal Reddy-Kiran Kumar Reddy
హైదరాబాద్: రోశయ్య రాజీనామా అనంతరం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ రెడ్డి వర్గం వారికే ఇవ్వాలని అధిష్టానం సమాలోచన చేసినట్టు సమాచారం. కొత్త ముఖ్యమంత్రిగా ఏఐసిసిలో ఇప్పటికే ఎన్నిక అయిపోయినట్లు సమాచారం. అయితే రెడ్డి వర్గానికి చెందిన వైయస్ జగన్ ను ఎదుర్కొనేందుకో అధిష్టానం రెడ్డి వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. వైయస్ జగన్మోహన్ తన తండ్రి చనిపోయినప్పటినుండి పదవి కోసం రాష్ట్రంలో ఏదో ఒక అలజటి సృష్టిస్తున్నారు.

అయితే ఆయన్ను అడ్డుకోవటానికి రెడ్డి వర్గానికి చెందిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డినిగాని, శాసనసభాపతి కిరణ్ కుమార్ రెడ్డినిగాని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలున్నాయి. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణకు చెందిన పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రెడ్డిలకే అవకాశం ఇస్తున్నట్టు ఏఐసిసి వర్గాలు కూడా సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. రేపు సాయంత్రంలోగా కొత్త ముఖ్యమంత్రి పదవీ స్వీకారం చేసే అవకాశం ఉంది.

బుధవారం సాయంత్రం సిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రిపై ఏకవాఖ్య తీర్మనం చేసే అవకాశం ఉంది. ఒకవేళ వైయస్ జగన్ వర్గం వారు సమావేశంలో ఏదైనా రాద్దాంతం చేసినప్పటికీ ముఖ్యమంత్రిని రెడ్డి వర్గానికి చెందిన వారికి ఇచ్చే అవకాశం ఉంది. కాగా రోశయ్య రాజీనామా విషయం తెలిసిన బెంగుళూరులో ఉన్న జగన్ హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+