రాజీనామా అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిన రోశయ్య

Rosaiah
హైదరాబాద్: కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా తన రాజీనామాను రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు సమర్పించి నేరుగా ఇంటికి వెళ్లారు. రాజ్ భవన్లో రాజీనామా అనంతరం ఆయన మీడియాతో సైతం మాట్లాడలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య 14 నెలల 22 రోజులు పదవిలో ఉన్నారు. ఆయన తదుపరి ప్రణాళిక ఏమిటో ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి సైనికుడిగా పనిచేస్తానని చెప్పారు.

రోశయ్య రాజీనామా సమర్పించడానికి గవర్నర్ దగ్గరకు వెళ్లినప్పుడు 9మంది మంత్రులు, 7గురు శాసనసభ్యులు వెంట ఉన్నారు. రాజీనామా అనంతరం ఇంటికి వెళ్లినప్పుడు కూడా కొందరు ఆయనతోనే ఉన్నారు. అయితే ఆయనను అధిష్టానం కొంత సమయం ఆగిన తర్వాత గవర్నర్ గా పంపే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ గవర్నర్ గా పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా రోశయ్య రాజీనామా తనను బాధించినట్లు పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+