వైఎస్ జగన్ వెంట ఏ ఎమ్మెల్యే, ఎంపీ వెళ్లరు: వి హనుమంతరావు

V Hanumantha Rao
హైదరాబాద్‌: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు అన్న ఒకే ఒక కారణంతో ఆయన హద్దులు దాటుతున్నప్పటికీ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తుందని రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం నియమించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలియజేయక పోవటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అభినందనలు తెలియజేయటం, తెలియజేయక పోవటం ఆయనిష్టమన్నారు.

జగన్ వెంట శాసనసభ్యులు ఉన్నారనో, పార్లమెంటు సభ్యులు ఉన్నారనో అధిష్టానం భయపడుతుందనుకోవటం ఒట్టిమాటనే అన్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అని దానిని దెబ్బతీయటం ఎవరి వల్ల కాదన్నారు. ఆయన వెంట ఉన్న వారి గురించి అధిష్టాన్న లేదన్నారు. జగన్ హద్దులు దాటుతున్నారన్నారనేది సుస్పష్టమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సరైన మంత్రివర్గాన్ని ఏర్పరుచుకోవాలన్నారు.

ఆయన ఎమ్మార్ కుంభకోణంపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. తాను ముఖ్యమంత్రిని కలిసి సిబిఐ విచారణకు విజ్ఞప్తి చేస్తాన్నారు.పార్టీని వదలి ఏ ఎమ్మెల్యే, ఎంపీ వెళ్లరని చూసి చూసి నీరు లేని బావిలోకి దూకుతారా అని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+