వ్యూహరచనలో వైయస్ జగన్ బిజీ: ఎమ్మెల్యేలతో సమావేశం
వైయస్ జగన్ సోమవారం ఉదయం తనకు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం కూర్పు లోగుట్టు బయటపడిన వెంటనే తిరుగుబాటు బావుటా ఎగురేయాలని వైయస్ జగన్ వర్గం అనుకుంటున్నట్లు సమాచారం. బుధవారం నుంచే వైయస్ జగన్ తిరుగుబాటు కార్యాచరణ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఆయన సాయంత్రం కడపకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్ తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి సోమవారం ఉదయం హైదరాబాదు చేరుకున్నారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు కడప వైయస్ విజయలక్ష్మి హైదరాబాద్ ys jagan congress kadapa ys vijayalaxmi hyderabad
Story first published: Monday, November 29, 2010, 10:17 [IST]