కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ కుటుంబమంతా కలిసే ఉంటుంది: వైయస్ వివేకానంద రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమంతా కలిసే ఉంటుందని వైయస్ జగన్ బాబాయ్, ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు. కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన మంగళవారం ఉదయం వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎటు వెళ్లినా కుటుంబ సభ్యులమంతా కలిసే వెళ్తామని ఆయన చెప్పారు. కుటుంబ సభ్యులు ఒకే మాటపై ఉంటారని ఆయన అన్నారు. అనంతరం ఆయన వైయస్ జగన్ తో భేటీ అయ్యారు.

వైయస్ జగన్ మామ నివాసంలో జరిగిన చర్చల్లో వైయస్ వివేకానంద రెడ్డితో సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. వైయస్సార్ సమాధి వద్ద మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఇడుపులపాయకు వైయస్ జగన్ చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద యెత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు, శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, మేకపాటి బ్రదర్స్ వైయస్ జగన్ ను కలిశారు. వైయస్ జగన్ వెంటే ఉంటానని శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X