వైయస్ జగన్ పై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పరోక్ష విమర్శ

Chandrababu Naidu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమైన వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్ష విమర్స చేశారు. తెలుగు ప్రజలు వైయస్ జగన్ కొత్త ప్రాంతీయ పార్టీని ఆదరిస్తారని అంబటి రాంబాబు చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీలో ఉన్నవారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడితే ఎవరూ విశ్వసించబోరని ఆయన అన్నారు. రైతు సమస్యలపై గురువారం అఖిల పక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సామాజిక న్యాయం కొరవడిందని ఆయన విమర్శించారు. మంత్రివర్గ మార్పు, శాఖల పంపకంపై గొడలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు డబ్బు పిచ్చి పట్టిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు వల్ల దేశంలో దుర్భర స్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు.

రైతు సమస్యలపై ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన చెప్పారు. రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన చెప్పారు. భారీ వర్షాల వల్ల, తుఫాను వల్ల రైతులు నష్టపోయారని వారిని ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. శాఖల కేటాయింపులపై మంత్రులు అసమ్మతి వ్యక్తం చేయడంపై తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. శాఖల కేటాయింపుల్లో ప్రాధాన్యత అంటే ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్సార్ హయాంలో కొనసాగిన దోపిడీనే తిరిగి కొనసాగించాలనేదే ప్రాధాన్యతనా అని ఆయన అడిగారు. శాఖల కేటాయింపులపై గొడవలు మానుకుని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన మంత్రులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+