చిరంజీవి అయోమయం జగన్నాథం, ఆశానిరాశలతో ఊగిసలాట

Chiranjeevi
హైదరాబాద్‌: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం అయోమయం జగన్నాథంలా మారింది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. మంచో చెడో ఏదో ఒకదానికి కట్టుబడి ఉండే స్థిరత్వాన్ని ప్రదర్శించలేకపోతోంది. ఒక సమైక్యాంధ్ర నినాదానికి కట్టుబడి ఉండడంలో తప్ప ఏ విషయంలోనూ ఆ పార్టీ ముందుకు సాగలేకపోతోంది. కాంగ్రెసు ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకుని ఆ తర్వాత చిరంజీవి మనసు మార్చుకున్నారు. ఆశానిరాశల మధ్య చిరంజీవి కొట్టుమిట్టాడుతున్నట్లు కనిపిస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పినా ఆ పాత్రను కూడా సరిగా పోషించలేకపోవడం ఆ పార్టీ బలహీనతగా చెప్పవచ్చు.

మధ్యంతర ఎన్నికలను నివారించాల్సిన ఆగత్యం చిరంజీవి పార్టీకి ఉందనే విషయం ఎవరూ కాదనలేని సత్యం. మధ్యంతరం వస్తే ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రభుత్వంలో చేరడం, చేరకపోవడం మీద ఇంతగా ఊగిసలాడాల్సిన అవసరం లేదు. తమ పార్టీకి చెందిన 18 మంది శాసనసభ్యులను కూడా చిరంజీవి ఒక తాటి మీద నిలబెట్టలేకపోతున్నారు. శోభానాగిరెడ్డి దాదాపుగా వైయస్ జగన్ వర్గంలో చేరిపోయినట్లే. మరో ఆరుగురినో, ఏడుగురినో కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రభావితం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవులు దక్కించుకున్నవారు తప్ప మిగతా వారంత శిబిరం మార్చే ప్రమాదం ఉంది.

మొత్తంగా పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే చర్యలేవీ చిరంజీవి చేపట్టకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుంది. కాంగ్రెసు అనుకూల వైఖరి కూడా ఆయనను బలహీనపరిచింది. ఈ విషయంలో ఆయన పూర్తిగా తన బావమరిది అల్లు అరవింద్ కు లొంగిపోయారనే విమర్శలున్నాయి. వైయస్ జగన్ పార్టీ వస్తే ప్రజారాజ్యం పార్టీ మరింతగా బలహీనపడే ప్రమాదం ఉంది. దాని నుంచి రక్షించుకోవడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలేవీ లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+